top of page
mulkanoor web copy.jpg

ములుకనూర్ ప్రజా గ్రంథాలయం

mulkanoor web copy_edited_edited.jpg
web banner.jpg
saraswathi peetam.jpg
Frame 1 (2).jpg
_VIP4024.jpg
483368669_684929050864798_595850712257442982_n.jpg
435c2f2a-15d2-45e0-b4a0-6574e19605d2.jpg
133A4252-scaled.jpg

Mulkanoor Praja Granthalayam

సమాజంలో అసమానతలు తగ్గాలన్నా.. ప్రతి మనిషీ ఆత్మగౌరవంతో జీవించాలన్నా... విద్యతోనే సాధ్యమని నమ్మి, ముల్కనూరు ప్రజా గ్రంథాలయం స్థాపించడం జరిగింది. అజ్ఞానపు చీకట్లను పారదోలడమే కాదు, దురలవాట్లకు దూరంగా యువతను నడపాలని, యువతలో నిగూఢంగానున్న అద్భుతమైన శక్తి సామర్థ్యాలను వెలికి తీసి, కుటుంబానికి, సమాజానికి గొప్ప మానవవనరులను అందించాలనే ఈమహా యజ్ఞంలో మాకు లభించిన సప్త నిధులు ఇవి..

ముల్కనూరు
ప్రజా గ్రంథాలయం

ములుకనూర్ ప్రజా గ్రంథాలయం హనుమకొండ జిల్లా, భీమదేవరపల్లి మండలంలోని ములుకనూర్ గ్రామంలో ఉంది. ఈ గ్రంథాలయం పేద , దిగువ మధ్య తరగతి విద్యార్థులకు వివిధ ప్రవేశ, ఉద్యోగ, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారికి  సహాయపడేందుకు, గ్రామీణ ప్రాంతాల్లో యువతను పుస్తకాల వైపు నడిపించి విజ్ఞానం అందించే లక్ష్యంతో ఏర్పాటైంది.  

జ్ఞానం 

జ్ఞాన సముపార్జన కేవలం పాఠశాల గదులకే పరిమితం కాదు.   జీవితాంతం సాగే నిరంతర ప్రవాహం. నేటి వేగవంతమైన ప్రపంచంలో, నిత్యం కొత్త విషయాలు నేర్చుకోవడం తప్పనిసరి. అలాంటి జ్ఞానార్జనకు ఈ  గ్రంథాలయం ఒక పవిత్రమైన ఆలయం. ఇది కేవలం పుస్తకాల కొలువు కాదు, ఆలోచనలకు, ఆవిష్కరణలకు నెలవు.

సాధన 

ఏ లక్ష్యానికైనా పునాది సాధన. నిరంతర ప్రయత్నం, ఓర్పు, అంకితభావం.. ఇవి మూలధనం. ఈ లక్షణాలు ఉన్నవారికి విజయం తథ్యం. ఆ పట్టుదలతో కూడిన  ప్రయాణంలో మా గ్రంథాలయం ఒక తోడుగా నిలుస్తుంది. ఇది కేవలం సమాచార కేంద్రం కాదు, ఉద్యోగార్థుల కలలను సాకారం చేసే శక్తి కేంద్రం.

విజయం

ఈ ఆవరణలో భావి తరాల ఆశల ఆనవాళ్లు నిక్షిప్తమై ఉన్నాయి. కాలంతో సంబంధం లేకుండా..  ఇక్కడి అక్షర జ్యోతుల వెలుగుల్లో రేపటి తరానికి దారి కనిపిస్తోంది. యువత తామెంచుకున్న ప్రయాణంలో విజయానికి తమవంతు తోడైందీ మన ప్రజా గ్రంథాలయం. 

Frame 1 (7).jpg
dyana mandhiram.jpg
Saraswathee peetam 2023 (18).JPG
mulkanooru katha 2025.jfif
Mulkanoor 2023 (1).jfif
Saraswathee peetam 2023 (31)_edited.jpg
133A4252-scaled.jpg
Frame 1 (4).jpg

జ్ఞానభూమిలో సప్త నిధులు

గ్రంథాలయ జ్ఞాన భూమిలో మహోన్నత కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. ఈ ఏడు కార్యక్రమాలు సప్త నిధులుగా భవిష్యత్తు తరాలకు తిరుగులేని సంపదగా మారతాయని విశ్వసిస్తున్నాం. సమాజానికి  జ్ఞానాన్ని, నైపుణ్యాలను, సంస్కృతిని  అందించేందుకు మేము చేస్తున్న కృషికి నిదర్శనాలుగా భవిష్యత్ తరాల ముందు  ఉండనున్నాయి. 

  • Instagram
  • Facebook
  • Youtube

గ్రంథాలయం

ప్రజాగ్రంథాలయం 2014లో ఏర్పాటైంది. దీనికి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికారులు  చేయూతనందించారు.   ఇది క్రమంగా కేవలం పుస్తకాల కేంద్రంగానే కాకుండా డిజిటల్‌ లైబ్రరీగా కూడా రూపు సంతరించుకుంది. నిత్యం పదుల సంఖ్యలో విద్యార్థులతో  కిటకిటలాడుతున్నది.

సాహితీ పీఠం

సాహిత్య గోష్ఠులు, కవి సమ్మేళనాలు, రచయితలతో ముఖాముఖి కార్యక్రమాల ద్వారా సాహిత్యంపై ఆసక్తిని పెంచుతోంది. ఏటా జాతీయ స్థాయి కథల పోటీ నిర్వహించడం ద్వారా తెలుగు రచయితలకు, కథకు పట్టం కడుతోంది.

ధ్యాన మందిరం

ఆధునిక కాలంలో పని ఒత్తిడితో కూడిన జీవితాలలో కొరవడిన మానసిక ప్రశాంతతను, తద్వారా సర్వతోముఖ వికాసాన్ని పెంపొందించడం కోసం గ్రంథాలయ ఆవరణలో ఒక ధ్యాన మందిరాన్ని ఏర్పాటు చేయనైనది

పోటీలు